మరో ముగ్గురికి కరోనా
ABN , First Publish Date - 2020-05-26T08:46:27+05:30 IST
విజయవాడలో సోమవారం మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. చిట్టినగర్లో ఇద్దరికి, భవానీపురంలో మరో వ్యక్తికి పాజిటివ్గా నిర్ధారణ అయి ..
విజయవాడ, ఆంధ్రజ్యోతి : విజయవాడలో సోమవారం మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. చిట్టినగర్లో ఇద్దరికి, భవానీపురంలో మరో వ్యక్తికి పాజిటివ్గా నిర్ధారణ అయి నట్లు వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ మూడు కేసులతో కలిపి జిల్లాలో అధికారికంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 440కు చేరుకుంది. విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవానీపురానికి చెందిన 70 సంవత్సరాల వృద్ధుడు కరోనా కారణంగా మరణించడంతో ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండా ఆసుపత్రి వైద్య సిబ్బందే దగ్గరుండి స్వర్గపురికి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ మరణాన్ని ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది.