డాక్టర్కు కరోనా... 900 మంది క్వారంటైన్
ABN , First Publish Date - 2020-03-27T06:20:31+05:30 IST
ఢిల్లీలోని ఓ ఆస్పత్రి వైద్యుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆయనకు దగ్గర చికిత్సకు వచ్చిన 900 మందిని క్వారంటైన్ చేశారు..
ఢిల్లీలోని ఓ ఆస్పత్రి వైద్యుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆయనకు దగ్గర చికిత్సకు వచ్చిన 900 మందిని క్వారంటైన్ చేశారు. ఆయన భార్య, కూతురికి కూడా వైరస్ సోకినట్లు తేలింది. ఓ మహిళ ఈ నెల 10న సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చారు. 12న ఆ వైద్యుడి వద్దకు చికిత్స కోసం వెళ్లారు. ఇక్కడ నుంచి వైరస్ చైన్ మొదలైంది. ఐదు రోజుల తర్వాత ఆమెకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అదే రోజు ఆ వైద్యుడిని కూడా ఆస్పత్రిలో చేర్చారు. ఆ మహిళ తల్లి, సోదరుడు, ఇద్దరు కూతుళ్లు, ఓ బంధువుకు కూడా కరోనా సోకింది.