కరోనా వచ్చిందని ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-17T05:20:36+05:30 IST
ఓ యువకుడికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో తీవ్ర ఆందోళనకు గురై విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెదవేగి, ఏప్రిల్ 16 : ఓ యువకుడికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో తీవ్ర ఆందోళనకు గురై విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదవేగి మండలం ఎస్ఐ సుధీర్ తెలిపిన వివరాలివి.. నడిపల్లికి చెందిన ఓ యువకుడు గుంటూరు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. రెండు రోజుల కిందట కరోనా పరీక్షలు నిర్వహించగా గురువారం రాత్రి స్వగ్రామానికి విచ్చేశాడు. శుక్రవారం ఉదయం సెల్ఫోన్కు కరోనా పాజిటివ్ సమాచారం వచ్చింది. ఆందోళనకు గురైన యువకుడు(26) ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకూ రాకపోయే సరికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతని సెల్కు ఫోన్ చేశారు. ‘నాకు కరోనా వచ్చింది. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నా. విజయరాయిలోని ఓ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్నా’నని చెప్పాడు. అతనిని వెతుక్కుంటూ అక్కడకు వెళ్లిన కుటుంబసభ్యులకు అపస్మారక స్థితిలో ఉన్నాడు. అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా అప్పటికే మృతి చెందడంతో మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.