ఊరు పొమ్మంది.. పడవ రమ్మంది!
ABN , First Publish Date - 2020-04-04T07:06:09+05:30 IST
జ్వరం వచ్చిన ఒక వృద్ధుడికి కరోనా సోకిందన్న భయంతో అతడి కుటుంబంతో పాటు ఊరంతా కలిసి వెలివేసిన ఘటన ఇది. పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లా హబీబ్పూర్కు చెందిన నిరంజన్ హాల్డెర్ అనే వృద్ధుడు ఊరూరా తిరిగి కీర్తనలు పాడి,
- కరోనాతో వెలివేసిన గ్రామస్థులు
మాల్డా, ఏప్రిల్ 3: జ్వరం వచ్చిన ఒక వృద్ధుడికి కరోనా సోకిందన్న భయంతో అతడి కుటుంబంతో పాటు ఊరంతా కలిసి వెలివేసిన ఘటన ఇది. పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లా హబీబ్పూర్కు చెందిన నిరంజన్ హాల్డెర్ అనే వృద్ధుడు ఊరూరా తిరిగి కీర్తనలు పాడి, ఆ వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకునేవాడు. కొద్దిరోజుల క్రితం అతడు వేరే ఊరి నుంచి స్వగ్రామానికి వస్తుండగా జ్వరం వచ్చింది. దీంతో అతడికి కరోనా సోకిందన్న అనుమానంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెలివేశారు. చేసేది లేక.. ఊరి బయట కాలవలో ఉన్న చిన్న పడవనే తన ఇల్లుగా మార్చుకుని నిరంజన్ జీవనాన్ని సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు, అతడికి అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారు.