కరోనా కలవరం!

ABN , First Publish Date - 2020-07-08T11:37:06+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే 186 మందిలో వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి.

కరోనా కలవరం!

జిల్లాలో పెరుగుతున్న వైరస్‌ కేసులు

మంగళవారం 186 నమోదు

1312కు చేరిన బాధితుల సంఖ్య 


గుజరాతీపేట, జూలై 7: జిల్లాలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే 186 మందిలో వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో బాధితుల సంఖ్య 1312కు చేరుకుంది. ప్రాథమిక నిర్థారణ పరీక్షల్లో వైరస్‌ లక్షణాలు బయట పడుతుండడంతో స్వాబ్‌ తీసి ల్యాబ్‌కు పంపుతున్నారు. పాజిటివ్‌ అని తేలితే కొవిడ్‌ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలందిస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది వలసకూలీలు జిల్లాకు వచ్చారు.


వారందరినీ పునరావాస కేంద్రాల్లో ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక నిర్థారణ పరీక్షలు చేస్తుండగా వందలాది మందిలో వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. వారందరినీ కొవిడ్‌ ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలందిస్తున్నారు. ఇంకా వేలాది మందికి సంబంధించి నివేదికలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకూ 575 మంది కోలుకోవడంతో జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్టు అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-07-08T11:37:06+05:30 IST