కరోనాతో సంగమేశ్వరాలయ ఈవో మృతి

ABN , First Publish Date - 2021-05-17T04:43:21+05:30 IST

కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయం కార్య నిర్వాహణాధికారి ఆవుల వెంకటేశ్వర్లు (50) కరోనాతో బాధపడుతూ చెన్నై వైద్యశాలలో ఆదివారం మృతిచెందారు.

కరోనాతో సంగమేశ్వరాలయ ఈవో మృతి

సంగం, మే 16: కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయం కార్య నిర్వాహణాధికారి ఆవుల వెంకటేశ్వర్లు (50) కరోనాతో బాధపడుతూ చెన్నై వైద్యశాలలో ఆదివారం మృతిచెందారు. నెల్లూరుకు చెందిన యయన పదిరోజుల క్రితం కరోనా టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో చెన్నైలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు గ్రామస్థులు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-05-17T04:43:21+05:30 IST