ఇంకా స్టేజ్-3లోకి రాలేదు
ABN , First Publish Date - 2020-03-27T06:35:18+05:30 IST
కరోనా కట్టడికి కేంద్రం లక్షల మంది సామాజిక ఆరోగ్య సిబ్బందిని రంగంలోకి దించుతోంది. 9 లక్షల మంది ఆశా వర్కర్లు..
- తేల్చిచెప్పిన ఐసీఎంఆర్
న్యూఢిల్లీ, మార్చి 26: కరోనా కట్టడికి కేంద్రం లక్షల మంది సామాజిక ఆరోగ్య సిబ్బందిని రంగంలోకి దించుతోంది. 9 లక్షల మంది ఆశా వర్కర్లు, 30 లక్షల మంది అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలను ఈ పనిలో వినియోగించుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో కరోనా బాధితుల కోసం పెంచుతున్నామన్నారు. 17 రాష్ట్రాల్లో కరోనా ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా ఆయన వెల్లడించారు. కాగా, గడచిన 24 గంటల్లో కేసులు, మరణాల సంఖ్యను చూసినపుడు ఇవి నిలకడగా ఉన్నట్లు అర్థమవుతుందని లవ్ అగర్వాల్ చెప్పారు. విదేశీప్రయాణం చేయని వారికి వైరస్ సోకలేదన్నది కేసుల ద్వారా తెలుస్తోంది. ‘ఒకట్రెండు కేసులను బట్టి స్టేజ్-3కి వచ్చామన్న నిర్ధారణకు రావడం సరికాదు. 20-30 శాతం కేసుల్లో పేషెంట్లు తమ వ్యాధి గురించి సరైన సమాచారం ఇవ్వలేదు’ అని ఐసీఎంఆర్లోని ఎపిడమాలజీ-కమ్యూనికబుల్ డిసీజెస్ విభాగం అధిపతి డాక్టర్ రామన్ గంగాఖేద్కర్ చెప్పారు.