భారత్‌లో రికార్డుస్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-22T16:03:43+05:30 IST

భారత దేశంలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

భారత్‌లో రికార్డుస్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత దేశంలో  రికార్డుస్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటీవ్ కేసులు 55 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 75,083 కరోనా కేసులు నమోదు కాగా.. 1,053 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 55,62,664కు కరోనా కేసులు చేరగా.. 88,935 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 9,75,681 యాక్టివ్ కేసులు ఉండగా.. చికిత్స నుంచి కోలుకుని 44,97,867 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 1,01,468 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 80.86 శాతం ఉందని, మరణాల రేటు 1.60 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Updated Date - 2020-09-22T16:03:43+05:30 IST