మరో 88 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-11-29T06:00:45+05:30 IST
జిల్లాలో శనివారం మరో 88 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసులు 58,628కు చేరాయి
జిల్లాలో 57,147కి చేరిన మొత్తం బాధితుల సంఖ్య
చికిత్స పొందుతూ ఒకరి మృతి
విశాఖపట్నం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శనివారం మరో 88 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసులు 58,628కు చేరాయి. వీరిలో వైరస్ నుంచి 57,147 మంది కోలుకోగా, మరో 974 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ శనివారం ఒకరు మృతి చెందారు. వీటితో జిల్లాలో మొత్తం కొవిడ్ మరణాలు 507కు చేరాయి.