ఆరుతడి పంటల సాగు విధానాన్ని పరిశీలించిన రైతులు
ABN , First Publish Date - 2020-02-20T07:17:35+05:30 IST
ఆరుతడి పంటల సాగు విధానాన్ని పరిశీలించిన రైతులు
జిన్నారం, ఫిబ్రవరి 19: వేసవిలో మొక్కజొన్న పెంపకం, వాణిజ్య, ఆరుతడి పంటల సాగు విధానాన్ని జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు పరిశీలించారు. బుధవారం వావిలాల శివారులో రైతు రఘునందన్ సాగు చేస్తున్న పంటలను జిల్లా ఉద్యాన వన శాఖ అధికారుల ఆధ్వర్యంలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ ప్రాంతాలకు చెందిన 70మంది రైతులు పరిశీలించారు. వేసవిలో టమాట, మొక్కజొన్న పెంపకం తీరును రఘునందన్ వివరించారు. బంతిపూల సాగు, అరటి, చిక్కుడు, బీర పంటల సాగులో మెలకువలు, ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హర్టికల్చరల్ శాఖ అధికారులు శైలజ, శ్రవంతి ఉన్నారు.