ప్రశాంత ఎన్నికకు సహకరించండి
ABN , First Publish Date - 2021-04-16T07:17:01+05:30 IST
ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించడంతోపాటు కాస్తంత సంయమనం పాటించాలని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు కేంద్ర బలగాలకు సూచించారు.
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 15: ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించడంతోపాటు కాస్తంత సంయమనం పాటించాలని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు కేంద్ర బలగాలకు సూచించారు. లోక్సభ ఉప ఎన్నికకు 716 మందితో కూడిన 8 కంపెనీల కేంద్రబలగాలు బుధవారం తిరుపతికి చేరుకోగా.. వారితో ఎస్పీ సమావేశమయ్యారు. అర్బన్ జిల్లాలోని పరిస్థితులను వివరించారు. విధినిర్వహణలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్థానిక పోలీసు అధికారుల సమన్వయంతో సమస్యను పరిష్కరించాలని చెప్పారు. ఎక్కడా తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) సుప్రజ, డీఎస్పీలు వెంకటరమణ (ఎస్బీ), కాటమరాజు, సూర్యనారాయణ (ఎస్సీ ఎస్టీ సెల్) తదితరులు పాల్గొన్నారు.