కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2020-08-14T11:37:43+05:30 IST

చెత్తను తరలించే వ్యాన్‌ పైనుంచి పడి ఓ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుడు బుధవారం రాత్రి మృతి చెందాడు. మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాల

కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుడి మృతి

మల్కాపురం, ఆగస్టు 13: చెత్తను తరలించే వ్యాన్‌ పైనుంచి పడి ఓ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుడు బుధవారం రాత్రి మృతి చెందాడు. మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాపురానికి చెందిన గురువులు(53) అనే కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుడు వ్యాన్‌లో చెత్త వేసే పనులు చేస్తుంటాడు. ఎప్పటిలాగే బుధవారం వ్యాన్‌లో చెత్త వేసి నిల్చొన్నాడు. ఇంతలో డ్రైవర్‌ వ్యాన్‌ను వేగంగా పోనిచ్చాడు. దీంతో చెట్ల కొమ్మల మధ్య ఉన్న టెలిఫోన్‌ తీగ గురువులు మెడకు తగలడంతో వ్యాన్‌ పైనుంచి కిందకు పడిపోయాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో కేజీహెచ్‌కి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-14T11:37:43+05:30 IST