ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి
ABN , First Publish Date - 2022-06-25T05:22:29+05:30 IST
యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని పాలమూరు యూనివర్సిటీ ఒ ప్పంద అధ్యాపకుల సంఘం(పుటా) నాయకులు డిమాండ్ చేశారు.
- యూనివర్సిటీలో ఒప్పంద అధ్యాపకుల నిరసన
పాలమూరు యూనివర్సిటీ, జూన్ 24 : యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని పాలమూరు యూనివర్సిటీ ఒ ప్పంద అధ్యాపకుల సంఘం(పుటా) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒప్పంద అధ్యాపకులతో కలిసి యూనివర్సిటీ ప్రధాన కార్యాల యం వద్ద నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అఽధ్యాపకుల నియామకానికి ప్రభుత్వం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడాన్ని వారు ఖండించారు. దశాబ్దా లుగా యూనివర్సిటీల్లో బోధిస్తున్న తమను జీవోనెం.16 ద్వారా క్రమబద్ధీకరిం చకపోవడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. తమను విస్మరించి ప్రభుత్వం రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడం తగదన్నారు. యూనివర్శిటీ ఒప్పంద అధ్యాపకులను క్రమబద్దీకరించే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని వెల్ల డించారు. ఈ కార్యక్రమంలో పుటా అధ్యక్షుడు డాక్టర్ భూమయ్య, రవికుమార్, డాక్టర్ విజయ్భాష్కర్, సుదర్శన్రెడ్డి, రవికాంత్, డాక్టర్ సుజాత పాల్గొన్నారు.