మెడిసిన్ కంటైనర్ లారీ దగ్ధం.. రూ.కోటిన్నర విలువైన..
ABN , First Publish Date - 2020-07-13T14:36:20+05:30 IST
మెడిసిన్ కంటైనర్ లారీ దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా శం షాబాద్ మండలం ఘన్సీమి యాగూడ హైదరాబాద్- బెంగుళూర్ జాతీయ
శంషాబాద్రూరల్ (రంగారెడ్డి): మెడిసిన్ కంటైనర్ లారీ దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా శం షాబాద్ మండలం ఘన్సీమి యాగూడ హైదరాబాద్- బెంగుళూర్ జాతీయ రహ దారిపై ఆదివారం చోటు చేసుకుంది. బెంగుళూర్ నుంచి మెడిసిన్ లోడ్తో హర్యానాకు వెళ్తుండగా మార్గమధ్యలో ఘన్సిమియాగూడ వద్దకు రాగానే కంటై నర్లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కంటైనర్ను రోడ్డు పక్కన నిలిపి ఫైర్స్టేషన్కు సమాచారమందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కంటైనర్లో కోటిన్నర విలువ గల మెడిసిన్ ఉన్నట్లు యాజమాన్యం తెలిపింది. అయితే ప్రమాదం విషయంపై సీఐ వివరణ కోరగా మాకు ఫిర్యాదు రాలేదని చెప్పారు. అందులో సగం వరకు మందులు దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రమా దం ఎలా జరిగిందనే విషయం తెలియదని కంటైనర్ డ్రైవర్ తెలిపాడు.