జెండావిష్కరణతో అయోధ్య మసీదు నిర్మాణం
ABN , First Publish Date - 2021-01-27T06:50:04+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మసీదు నిర్మాణాన్ని త్రివర్ణ పతాకావిష్కరణతో ప్రారంభించారు. సుప్రీంకోర్టు
లఖ్నవూ, జనవరి 26: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మసీదు నిర్మాణాన్ని త్రివర్ణ పతాకావిష్కరణతో ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ధనీపూర్ గ్రామంలో కేటాయించిన ఐదెకరాల స్థలంలో ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు మంగళవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు జెండావిష్కరణ చేసి.. మసీదు శంకుస్థాపన సూచకంగా ఆ ప్రాంతంలో ఓ మొక్కను నాటారు.