రాజ్యాంగంతో స్వేచ్ఛ

ABN , First Publish Date - 2021-01-27T05:57:43+05:30 IST

దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రతీ పౌరునికి స్వేచ్ఛాయుత జీవనాన్ని అందించాలనే సంకల్పంతో రాజ్యాంగ రచన జరిగిందని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి అన్నారు.

రాజ్యాంగంతో స్వేచ్ఛ
రాజమహేంద్రవరంలో గణతంత్ర వేడుకలో పాల్గొన్న సబ్‌కలెక్టర్‌

  • సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి.. ఘనంగా గణతంత్ర వేడుకలు

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 26: దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రతీ పౌరునికి స్వేచ్ఛాయుత జీవనాన్ని అందించాలనే సంకల్పంతో రాజ్యాంగ రచన జరిగిందని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి అన్నారు. గణతంత్ర వేడుకలను జిల్లాలో పలుచోట్ల మంగళవారం నిర్వహించారు. పలువురు అధికారులు, నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ జాతీయపతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఏవో జీఎఎల్‌ఎస్‌ దేవి, డిప్యూటీ తహశీల్దార్లు పరిమళ, ఎన్‌వీజీ శేఖర్‌, సీనియర్‌ సహాయకులు కేవీఎస్‌ రామయ్య, సిబ్బంది ఆది, హెచ్‌ శ్రీరాం, పోలీసు సాయుధ దళాలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:57:43+05:30 IST