'ధరోహర్' వెబ్‌ సిరీస్ ప్రారంభించిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-08-15T22:06:53+05:30 IST

దేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'ధరోహర్' (వారసత్వం) అనే వెబ్ సిరీస్‌ను కాంగ్రెస్ పార్టీ ..

'ధరోహర్' వెబ్‌ సిరీస్ ప్రారంభించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: దేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'ధరోహర్' (వారసత్వం) అనే వెబ్ సిరీస్‌ను కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు ప్రారంభించింది. భారతదేశాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా, శాస్త్ర సాంకేతికపరంగా, ఆరోగ్యం, సైనిక, సంస్కృతిక పరంగా గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుందని, లౌకిక, ప్రజాస్వామిక స్వభావంపై ఎప్పుడూ రాజీపడలేదని ఏఐసీసీ సమాచారవిభాగం ఇన్‌చార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ఏఐసీసీ సోషల్ మీడియా డిపార్ట్‌మెంట్ చైర్మన్ రోహన్ గుప్తా ఒక పత్రికా ప్రకనటలో పేర్కొన్నారు.


'ధరోహార్' కాంగ్రెస్ చరిత్రకు, దేశానికి అందించిన సేవలకు నిలువటద్దమని, స్వాతంత్ర్య పోరాటం నుంచి, స్వాతంత్ర్య సిద్ధించిన కేవలం 70 ఏళ్లలో ఇండియాను సూపర్ పవర్‌గా తీర్చిదిద్దడం వరకూ కాంగ్రెస్ చేసిన కృషిని ప్రతిబింబిస్తుందని ఏఐసీసీ ఆ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2020-08-15T22:06:53+05:30 IST