యూపీ ఎన్నికల్లో ఉన్నవో అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్

ABN , First Publish Date - 2022-01-13T18:28:13+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నవో అత్యాచారం కేసు యూపీ ఎన్నికల్లో మరోసారి చర్చనీయాంశంగా మారనుంది....

యూపీ ఎన్నికల్లో ఉన్నవో అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్

లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నవో అత్యాచారం కేసు యూపీ ఎన్నికల్లో మరోసారి చర్చనీయాంశంగా మారనుంది. యూపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నవో అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది.కుల్దీప్ సింగ్ సెంగార్ ఓ బాలికపై అత్యాచారం చేశాడు.ఈ ఘటనలో నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ జైలు పాలయ్యారు. అత్యాచార బాధిత బాలికను హతమార్చేందుకు బీజేపీ ఎమ్మెల్యే కుట్ర పన్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధిత బాలికకు సుప్రీం అండగా నిలిచింది. 

Updated Date - 2022-01-13T18:28:13+05:30 IST