బీజేపీ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-07-12T20:31:42+05:30 IST
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్బై చెప్పనున్నారు. బడా మల్హెర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే..
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్బై చెప్పనున్నారు. బడా మల్హెర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రద్యుమ్న సింగ్ లోథి ఆదివారంనాడు భోపాల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలుసుకున్నారు. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకునే ఆయన సీఎంను కలిసినట్టు తెలుస్తోంది.
గత మార్చిలో జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో కమల్నాథ్ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలకు గతవారం కేబినెట్ విస్తరణలో శివరాజ్ సింగ్ పెద్దపీట వేశారు.