మరో 4 వికెట్లు పడతాయి
ABN , First Publish Date - 2022-04-16T16:22:28+05:30 IST
రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుందని, త్వరలోనే మరో 4 కీలకమైన వికెట్లు పడనున్నాయని కాంగ్రెస్ జోస్యం చెప్పింది. సచివాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే
- కాంగ్రెస్ జోస్యం
బెంగళూరు: రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుందని, త్వరలోనే మరో 4 కీలకమైన వికెట్లు పడనున్నాయని కాంగ్రెస్ జోస్యం చెప్పింది. సచివాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే మీడియాతో మాట్లాడుతూ... సాంఘిక సంక్షేమశాఖలో గంగా కల్యాణ పథకం కింద బోర్లు కేటాయింపులలో భారీగా గోల్మాల్ జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను త్వరలోనే మీడియా ముందుకు తెస్తామన్నారు. నిష్పక్షపాత విచారణ జరిపితే నలుగురు మంత్రులు ఇంటిదారి పట్టడం ఖాయమన్నారు. కాగా పోలీసుశాఖలోకి ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలను పథకం ప్ర కారం జొప్పిస్తున్నారని కేపీసీసీ కా ర్యాధ్యక్షుడు రామలింగారెడ్డి సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ చేస్తున్న పోరాటాలను బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తుండడం సిగ్గుచేటన్నారు.