మహిళా దినోత్సవం సందర్భంగా గుర్రంపై అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-03-09T02:26:14+05:30 IST

సోమవారం జార్ఖండ్ రాజధానిలో రాంచీలో కినిపించిన ఈ దృశ్యం స్థానికులను అమితంగా ఆకట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇతరులు ఆమెను అసెంబ్లీ వరకు అనుసరిస్తూ వచ్చారు. అనంతరం అసెంబ్లీ బయట కూడా

మహిళా దినోత్సవం సందర్భంగా గుర్రంపై అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యే

రాంచీ: జార్ఖండ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు గుర్రంపై వచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ గుర్రాన్ని తనకు మాజీ కల్నల్ బహుమతిగా ఇచ్చారని, అనంతరం అదే గుర్రంపై అసెంబ్లీకి వచ్చానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ అన్నారు. సోమవారం జార్ఖండ్ రాజధానిలో రాంచీలో కినిపించిన ఈ దృశ్యం స్థానికులను అమితంగా ఆకట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇతరులు ఆమెను అసెంబ్లీ వరకు అనుసరిస్తూ వచ్చారు. అనంతరం అసెంబ్లీ బయట కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడి ఈ ఆసక్తికర సన్నివేశాన్ని తిలకించారు.


‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ కల్నల్ రవి రాథోడ్ నాకు ఈ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు. దీనిపై అసెంబ్లీకి రావాలని అనిపించింది. వచ్చేశాను’’ అని అంబా ప్రసాద్ తెలిపారు. అంబా ప్రసాద్, బర్కోగాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు. ఆమె వయసు 31 ఏళ్లు. ప్రస్తుత జార్ఖండ్ అసెంబ్లీలో అంబానే పిన్న వయస్కురాలు.

Updated Date - 2021-03-09T02:26:14+05:30 IST