‘తెల్ల దొరలపై పోరాడిన సమరయోధులకు పాదాభివందనాలు’

ABN , First Publish Date - 2020-08-09T20:00:23+05:30 IST

క్విట్ ఇండియా ఉద్యమానికి నేటితో 78 ఏళ్లు నిండాయి.

‘తెల్ల దొరలపై పోరాడిన సమరయోధులకు పాదాభివందనాలు’

సిద్ధిపేట : క్విట్ ఇండియా ఉద్యమానికి నేటితో 78 ఏళ్లు నిండాయి. క్విట్ ఇండియా ఉద్యమ రోజు సందర్భంగా అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల అధ్యక్షుడు జంగాపల్లి ఐలయ్య కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జంగాపల్లి మాట్లాడుతూ.. సంపూర్ణ స్వరాజ్యమే లక్ష్యంగా మహాత్ముడు గాంధి ఇచ్చిన ‘డూ ఆర్ డై’ అనే నినాదంతో తెల్ల దొరలపై తెగబడి పోరాడిన ప్రతి స్వాతంత్ర సమరయోధుడికి పాదాభివందనం చేశారు.


ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జంగాపల్లి ఐలయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ ముకుంద రెడ్డి, ఎస్టి సెల్ రాజు నాయక్, మైనార్టీ సెల్ ఎండి ఫరీద్, సింగిల్ విండో డైరెక్టర్ బండి కుమార్, పీర్లల లింగమూర్తి, కార్యకర్తలు రాజు, శ్రీకాంత్ సందీప్ భూపతి లింగా రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T20:00:23+05:30 IST