వచ్కేది కాంగ్రెస్ ప్రభుత్వమే...నిరుత్సాహం వద్దు: ఉత్తమ్

ABN , First Publish Date - 2020-12-28T16:15:56+05:30 IST

కాంగ్రెస్ ఒక్కటే..ఈ దేశం కోసం..ఈ మట్టి కోసం పని చేస్తోందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

వచ్కేది కాంగ్రెస్ ప్రభుత్వమే...నిరుత్సాహం వద్దు: ఉత్తమ్

హైదరాబాద్: కాంగ్రెస్ ఒక్కటే..ఈ దేశం కోసం..ఈ మట్టి కోసం పని చేస్తోందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా ఉత్తమ్ గాంధీ భవన్‌లో పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  జై జవాన్.. జై కిసాన్ అన్న నినాదం కాంగ్రెస్ దే అని చెప్పుకొచ్చారు.  కేసీఆర్ దరిద్రపు పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.  రైతులను నట్టేట ముంచి మోసం చేస్తున్నారన్నారు. ఎంఎస్పీ ఇవ్వాల్సిన ప్రభుత్వం.. లాభ నష్టాల గురించి ఆలోచిస్తుందని మండిపడ్డారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని... పార్టీ నాయకులు నిరుత్సాహ పడొద్దు అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-28T16:15:56+05:30 IST