పెట్రోల్, డీజిల్ ధర పెంపుకు మోదీ ప్రభుత్వమే కారణం: ఉత్తమ్
ABN , First Publish Date - 2021-06-11T19:35:36+05:30 IST
ఏఐసీసీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గించాలని ఆందోళన చేపట్టామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: ఏఐసీసీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గించాలని ఆందోళన చేపట్టామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల కారణంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర 100కు చేరిందన్నారు. పెట్రోల్ ధర ఏడాది నుండి 25 రూపాయలు పెరిగిందని..దీనికి కారణం మోదీ ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు. సుమారు 43 సార్లు ధరలను పెంచారన్నారు. యూపీఏ ప్రభుత్వంలో 52,000 కోట్లు మాత్రమే ఉందని... రూ. 2014లో 72 వేల కోట్లు ఎన్డీయేలో పెంచిందన్నారు. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుంటే ఇక్కడ ఎక్సైజ్ సుంకం భారీగా పెరిగిందని తెలిపారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ భారీగా పెంచుతూ పేదల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. 2013లో 31 శాతం రాష్ట్ర పన్ను ఉండేదని అన్నారు. ఈ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై కాంగ్రెస్ ఆందోళన చేస్తున్నామన్నారు. వెంటనే వీటిని తగ్గించాలని ఉత్తమ్ కుమార్రెడ్డి డిమాండ్ చేశారు.