నిరుద్యోగ యువతను వైసీపీ మోసగించింది: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2020-12-21T16:44:35+05:30 IST

నిరుద్యోగ యువతను వైసీపీ నమ్మించి మోసగించిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు.

నిరుద్యోగ యువతను వైసీపీ మోసగించింది: తులసిరెడ్డి

అమరావతి: నిరుద్యోగ యువతను వైసీపీ నమ్మించి మోసగించిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పైవేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొని అధికారంలోకి వచ్చాక భర్తీ చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. మేనిఫెస్టోలో వైసీపీ ప్రతి ఏడాది జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకీ క్యాలెండరును విడుదల చేస్తామని, ప్రత్యేక హోదా అని ఎందుకు అమలు  చేయలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్రాహ్మణ తదితర నిధులను అమ్మఒడికి, వాహన మిత్రకు మళ్ళించడం వలన ఆయా కార్పొరేషన్ల స్వయం ఉపాధి పధకాలను అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగ పదకం కల్పించే యువనేస్తాం పథకం రద్దు అయ్యిందని తెలిపారు. యువకుడైన జగన్ పాలనలో యువశక్తి నిర్వీర్యం కావడం దురదృష్టకరమని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-12-21T16:44:35+05:30 IST