రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: Sunkara
ABN , First Publish Date - 2021-11-04T13:57:35+05:30 IST
ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయవాడ: ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. టపాసుల కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఆనందంతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తండ్రిలా రాష్ట్ర ప్రజలను కాపాడాలి కానీ ప్రజల మధ్య విద్వేషాలు రగల్చకూడదన్నారు. అమరావతి రైతులు చేసిన పాపం ఏంటో అర్ధం కావడం లేదని తెలిపారు. అమరావతి రాజధాని ఆవశ్యకతను, వారు అనుభవిస్తున్న మానసిక ఆవేదనను రాష్ట్ర ప్రజలకు తెలిపేందుకు అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టారని సుంకర పేర్కొన్నారు. పాదయాత్రకు ప్రభుత్వం, పోలీసులు సహకరించకపోయిన న్యాయ దేవత సహకారంతో రైతులు పాదయాత్ర చేపట్టారన్నారు. ప్రజలు అడగకపోయిన ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిందని తెలిపారు.
మూడు రాజధానుల అవసరాన్ని వివరిస్తూ తమరు పాదయాత్ర చేయాలని...ఎవరు అపుతారని ప్రశ్నించారు. విభజన తర్వాత గమ్యం లేకుండా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏపీని రాజధాని రైతులు అక్కున చేర్చుకున్నారని గుర్తుచేశారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై కొంతమంది వైసీపీ పెద్దలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అనుకోని సంఘటన జరిగితే అంటూ లీకులు ఇస్తున్నట్టు మాట్లాడుతూన్నారన్నారు. మానసిక ఆవేదనతో రైతులు చేస్తున్న ఈ పాదయాత్రపై విమర్శలు చేయడం విజ్ఞత కాదన్నారుఅమరావతి రైతుల పాదయాత్ర గమ్యస్థానం చేరే వరకు . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలని సుంకర పద్మశ్రీ కోరారు.