కేసీఆర్ బంగారు భారత్ నినాదం హాస్యాస్పదం: Ponnala

ABN , First Publish Date - 2022-02-22T19:13:28+05:30 IST

సీఎం కేసీఆర్ బంగారు భారత్ నినాదం హాస్యాస్పదమని మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

కేసీఆర్ బంగారు భారత్ నినాదం హాస్యాస్పదం: Ponnala

హైదరాబాద్: సీఎం కేసీఆర్ బంగారు భారత్ నినాదం హాస్యాస్పదమని మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఇంగిత జ్ఞానం లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్... ఇప్పుడు దేశం వైపు చూస్తున్నారని మండిపడ్డారు. సైకిల్ టెర్రరిస్ట్ అంటూ మోదీ మాట్లాడటం సరికాదన్నారు. చేతగాని అసమర్ధులు దేశాన్ని పాలిస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-02-22T19:13:28+05:30 IST