మర్కజ్ పర్యటనను దాచిపెట్టిన కాంగ్రెస్ నేతపై కేసు
ABN , First Publish Date - 2020-04-10T22:44:29+05:30 IST
తబ్లిగి జమాత్ ప్రధాన కార్యాలయంలో గత నెలలో జరిగిన మర్కజ్ సదస్సుకు హాజరైన విషయాన్ని దాచిపెట్టిన ఢిల్లీ కాంగ్రెస్ నేత ఒకరిపై పోలీసులు కేసు నమోదు ..
న్యూఢిల్లీ: తబ్లిగీ జమాత్ ప్రధాన కార్యాలయంలో గత నెలలో జరిగిన మర్కజ్ సదస్సుకు హాజరైన విషయాన్ని దాచిపెట్టిన ఢిల్లీ కాంగ్రెస్ నేత ఒకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నేతకు, ఆయన భార్యకు, కుమార్తెలకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం వీరంతా అంబేద్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, కాంగ్రెస్ నేత నివసిస్తున్న నైరుతి ఢిల్లీలోని దీన్పూర్ గ్రామాన్ని సైతం సీల్ చేశారు. గ్రామస్థులను ఇళ్లలోనే ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. కాంగ్రెస్ నేతపై ఐపీసీలోని పలు సెక్షన్లు, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద ఛావ్లా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. కాగా, దేశంలోనే అతిపెద్ద కరోనా హాట్స్పాట్గా జమాత్ హెడ్క్వార్టర్స్ నిలవడం ఇటీవల సంచలనమైంది.