గోవా ఎన్నికల పరిశీలకుడిగా చిదంబరం నియామకం

ABN , First Publish Date - 2021-08-09T21:59:14+05:30 IST

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పర్యవేక్షణ, సమన్యయం కోసం..

గోవా ఎన్నికల పరిశీలకుడిగా చిదంబరం నియామకం

న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పర్యవేక్షణ, సమన్యయం కోసం అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పరిశీలకుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరంను పార్టీ అధిష్ఠానం నియమించింది. మణిపూర్ పరిశీలకునిగా జైరామ్ రమేష్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ ఈ నియమాకాల విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

Updated Date - 2021-08-09T21:59:14+05:30 IST