కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
ABN , First Publish Date - 2020-12-06T05:48:49+05:30 IST
అమరావతి రాజధానితో పాటు ఇతర అంశాలపై సీఎంను కలిసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకొన్నారు.
గుంటూరు, డిసెంబరు 5: అమరావతి రాజధానితో పాటు ఇతర అంశాలపై సీఎంను కలిసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకొన్నారు. శనివారం మంగళగిరి కాంగ్రెస్ కార్యాలయానికి ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్, సుంకర పద్మశ్రీ ఇతర నాయకులు చేరుకున్నారు. వారిని అరెస్టు చేసి స్థానిక స్టేషన్కు తరలించారు. గుంటూరులో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగన్మోహన్రెడ్డి ఇతర నేతలను గృహ నిర్బంధం చేశారు. బయటకు వచ్చే ప్రయత్నం చేయగా మస్తాన్వలితో పాటు ఇతర నాయకులను అరెస్టు చేసి లాలాపేట పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మస్తాన్వలి మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా సీఎంను కలిసి సూచనలు, సలహాలు చేసేందుకు ప్రయత్నిస్తే అరెస్టులతో అడ్డుకోవటం సరికాదన్నారు.