కరాటే స్వర్ణ పతక విజేత కార్తీకరెడ్డికి అభినందన

ABN , First Publish Date - 2022-09-26T06:38:23+05:30 IST

కామన్‌ వెల్త్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన కార్తీకరెడ్డిని స్పోర్ట్సు కరాటే డో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులు అభినందించారు.

కరాటే స్వర్ణ పతక విజేత కార్తీకరెడ్డికి అభినందన
కార్తీకరెడ్డికి నగదు బహుమతి అందిస్తున్న స్పోర్ట్సు కరాటే డో అసోసియేషన్‌ ప్రతినిధులు మిల్టన్‌ శాస్ర్తి, చిగురుపల్లి సతీశ్‌ కుమార్‌

విశాఖపట్నం(స్పోర్ట్సు), సెప్టెంబరు 25: కామన్‌ వెల్త్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన కార్తీకరెడ్డిని స్పోర్ట్సు కరాటే డో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులు అభినందించారు. ఆదివారం నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో  అసోసియేషన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు మిల్టన్‌ శాస్ర్తి, చిగురుపల్లి సతీష్‌కుమార్‌లు మాట్లాడుతూ కరాటే క్రీడాంశానికి ఒలింపిక్‌ గేమ్స్‌ గుర్తింపు వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మక కామన్‌వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో కార్తీకరెడ్డి స్వర్ణ పతకం సాధించడం శుభ పరిణామమన్నారు. కార్తీకరెడ్డి సాధించిన పతకంతో కరాటే క్రీడాంశానికి ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్సు అథారిటీ(శాప్‌)  క్రీడగా గుర్తించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు జారీ చేయడం ఆనందాయకమన్నారు.  స్పోర్ట్సు కరాటే డో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి కార్తీక రెడ్డికి రూ.50 వేలు నగదు ప్రోత్సాహాన్ని అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి ఎంవీ మాణిక్యాలు,  స్పోర్ట్సు కరాటే డో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-26T06:38:23+05:30 IST