బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2022-05-27T05:03:55+05:30 IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం
శంషాబాద్, మే 26: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఓ విదేశీ ప్రయాణికుడు అక్రమంగా తెస్తున్న బంగారు ఆభరణాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివారాలు ఇలా ఉన్నాయి. దుబాయ్ నుంచి వచ్చిన ఎఫ్35 జెడ్ 5435 ఫ్లైట్ ప్రయాణికులను తనిఖీ చేశారు. ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తెచ్చిన బంగారు నగలను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తూకం వేయగా 723.4గ్రాములున్నాయి. వీటివిలువ రూ.37.91 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.