830 కిలోల పీడీఎస్‌ రైస్‌ పట్టివేత

ABN , First Publish Date - 2021-05-06T04:22:52+05:30 IST

మండలంలోని అమరపినివానిపాలెం సమీప పొలంలోని రేకుల షెడ్డులో అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్‌ బియ్యాన్ని సివిల్‌ సప్లై అధికారులు బుధవారం సీజ్‌ చేశారు.

830 కిలోల పీడీఎస్‌ రైస్‌ పట్టివేత
నిల్వ చేసిన బియ్యాన్ని పరిశీలిస్తున్న సీఎస్‌డీటీ

సబ్బవరం, మే 5: మండలంలోని అమరపినివానిపాలెం సమీప పొలంలోని రేకుల షెడ్డులో అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్‌ బియ్యాన్ని సివిల్‌ సప్లై అధికారులు బుధవారం సీజ్‌ చేశారు. సీఎస్‌డీటీ సులోచనరాణి తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని గండేపల్లి అప్పారావు పొలంలోని షెడ్‌లో బియ్యం నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. సబ్బవరం సాయినగర్‌ కాలనీకి చెందిన కోన గోవిందరావు రేషన్‌ కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి  ఇక్కడ నిల్వ చేశారన్నారు. అతడిపై 6ఎ కేసు నమోదు చేసి, బియ్యాన్ని పెందుర్తి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించామన్నారు. దాడుల్లో వీఆర్వో పూడి శేషు తదితరులు పాల్గొన్నారు.

.

Updated Date - 2021-05-06T04:22:52+05:30 IST