మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-12-05T04:41:25+05:30 IST

పట్టణంలోని గడియారం సెంటర్‌ వద్ద మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యకు ఆర్యవైశ్యులు ఘన నివాళులర్పించారు.

మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు ఘన నివాళి
నాయుడుపేట: నివాళులర్పిస్తున్న ఆర్యవైశ్య సంఘ నాయకులు

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 4 : పట్టణంలోని గడియారం సెంటర్‌ వద్ద మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యకు ఆర్యవైశ్యులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్యసంఘ గౌరవ అధ్యక్షుడు పెసల రాజాబాబు మాట్లాడు తూ  ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఆయన అందించిన సేవ లను గుర్తుచేశారు.  ఆర్యవైశ్యసంఘ జిల్లా రూరల్‌ అధ్యక్షుడు కన మర్లపూడి సుబ్రమణి, జిల్లా రూరల్‌ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వ ర్లు, ఆర్యవైశ్య సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, కోట వెంకటే శ్వర్లు, బలరామ్‌, పట్టణ ఆర్యవైశ్యసంఘ నాయకులు పాల్గొన్నారు. 

గూడూరు: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు గూడూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో శనివారం వెంకటగిరి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ పంటా శ్రీనివా సులురెడ్డి, నాయకులు  నివాళులర్పించారు.  శాసనసభలో 15 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో పూల చంద్ర శేఖర్‌, నాగభూషణం, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్‌ వద్ద నివాళు లర్పించా రు.  సోమిశెట్టి చెంచురామయ్య, గాధంశెట్టి గిరిబాబు, సుధాకర్‌, ప్రసాద్‌, వంశీ, గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-05T04:41:25+05:30 IST