‘మండే’ ఎండతో అవస్థలు
ABN , First Publish Date - 2021-04-13T06:16:36+05:30 IST
రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
పాయకరావుపేట, ఏప్రిల్ 12 : రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సోమవారం ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడంతో పాటు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఈ ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రోడ్లపై అంతగా జనసచారం కానరాలేదు. పల్లె ప్రాంతాల నుంచి పట్టణానికి వివిధ పనులపై వచ్చేవారి అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. వాతావరణం ఇప్పుడే ఇలా ఉంటే ఇక కార్తెల సమయంలో పరిస్థితి ఏమిటని అంతా ఆందోళన చెందుతున్నారు.