చిరువ్యాపారుల ఆందోళన

ABN , First Publish Date - 2022-05-17T05:36:16+05:30 IST

చిరువ్యాపారుల ఆందోళన

చిరువ్యాపారుల ఆందోళన
జేపీ దర్గాలో సర్వే పనులు పర్యవేక్షిస్తున్న ఆర్డీవో రాజేశ్వరీ

కొత్తూర్‌, మే 16: తమకు న్యాయం చేయాలంటూ వందలాది మంది చిరువ్యాపారులు రెవెన్యూ, వక్ఫ్‌బోర్డు అధికారుల ముందు అవేదన వ్యక్తం చేశారు. కొత్తూర్‌ మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో గల హజ్రత్‌ జహంగీర్‌పీర్‌ దర్గాను మాస్టర్‌ ప్లాన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం 50కోట్ల రుపాయలను మంజూరు చేసింది. ఈప్లాన్‌లో భాగంగా సోమవారం రెవన్యూ, వక్ఫ్‌బోర్డు అధికారులు భూసేకరణ నిమిత్తం దర్గా పరిసరాల్లో సర్వే పనులు నిర్వహించారు. దీంతో తమ జీవనం పొతుందని ఆందోళన చెందిన చిరువ్యాపారులు సర్వే పనులకు అడ్డు తగిలారు. ఆర్డీవో రాజేశ్వరీ, తహసీల్దార్‌ రాములు వ్యాపారులకు నచ్చజెప్పినా వినలేదు. చిరు వ్యాపారులందరు షాద్‌నగర్‌ ఎమ్మెల్యేఅంజయ్యయాదవ్‌ నివాసానికి తరలివెళ్లి తమ అవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మధ్యాహ్నం తర్వాత అధికారులు చిరువ్యాపారుల వివరాలు సేకరించారు. 

Updated Date - 2022-05-17T05:36:16+05:30 IST