పారిశుధ్య కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2021-06-15T05:32:04+05:30 IST

జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం ఎదుట ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులు సోమవారం ఆందోళ కార్యక్రమం చేపట్టారు.

పారిశుధ్య కార్మికుల ఆందోళన
జీవీఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 14:
జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం ఎదుట ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులు సోమవారం ఆందోళ కార్యక్రమం చేపట్టారు. నెహ్రూచౌక్‌లో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేశారు. అనకాపల్లిలో ఖాళీగా ఉన్న 156 పారిశుధ్య కార్మికుల పోస్టులను భర్తీ చేయాలని, ఎనిమిది నెలలుగా ఇవ్వాల్సిన మెడికల్‌ బకాయిలు మంజూరు చేయాలని, పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. డిమాండ్ల సాధనకు మంగళవారం పనులను నిలుపుదల చేసి సమ్మె చేస్తామని కార్మికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేత  మళ్ల సత్యనారాయణ, రైతు సంఘం నేత ఎ.బాలకృష్ణ, కార్మిక సంఘ నేతలు బొమ్మల రాము, వాసు, అజయ్‌, ఏసురాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T05:32:04+05:30 IST