క్రిమినల్‌ కేసులు రాజీ చేయండి

ABN , First Publish Date - 2020-12-06T05:10:10+05:30 IST

కొత్తవలస కోర్టులో ఈ నెల 12న నిర్వహించే లోక్‌ అదాలత్‌లో వీలై నన్ని క్రిమినల్‌ కేసులను రాజీ చేసేందుకు కృషి చేయా లని కొత్త వలస జూనియర్‌ సివిల్‌ జడ్జి సూర్య కిరణ్‌శ్రీ సూచించారు.

క్రిమినల్‌ కేసులు రాజీ చేయండి

కొత్తవలస, డిసెంబరు 5:  కొత్తవలస కోర్టులో ఈ నెల 12న  నిర్వహించే లోక్‌ అదాలత్‌లో వీలై నన్ని  క్రిమినల్‌ కేసులను రాజీ చేసేందుకు కృషి చేయా లని కొత్త వలస జూనియర్‌ సివిల్‌ జడ్జి సూర్య కిరణ్‌శ్రీ సూచించారు. శని వారం కొత్తవలస కోర్టులో కొత్త వలస, లక్కవరపుకోట, వేపాడ మం డలాలకు చెందిన పోలీసు అధి కారులు, న్యాయవాదులు, కొత్తవలస ఎక్సైజ్‌స్టేషన్‌ అధికారులతో సమావేశం నిర్వ హించి మాట్లాడారు. ఎస్‌ఐలు ప్రయాగ మూర్తి, లక్ష్మణరావు, లోవ రాజు, రమ్య శ్రీతో పాటు కోర్టు సూపరింటెండెంట్‌ భూపేంద్ర కుమార్‌, న్యాయ వాదుల సం ఘం అధ్యక్షుడు ఎన్‌శ్రీరామమూర్తి, కార్యదర్శి ఎంవీ వీఎస్‌ గిరిబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:10:10+05:30 IST