బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-03-05T05:57:31+05:30 IST

తమచేత బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపచేశారని సత్తెనపల్లి మున్సిపాలిటీలోని 6వ వార్డు టీడీపీ అభ్యర్థి కోటేశ్వరి, 25వార్డు జనసేన అభ్యర్థి కె.అనురాధా తెలిపారు.

బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ
విజయవాడలో ఎస్‌ఈసీ కలిసిన కోటేశ్వరి, అనురాధ

విజయవాడ వెళ్లి ఎస్‌ఈసీకు అభ్యర్థుల ఫిర్యాదు 

సత్తెనపల్లి, మార్చి 4: తమచేత బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపచేశారని సత్తెనపల్లి మున్సిపాలిటీలోని 6వ వార్డు టీడీపీ అభ్యర్థి కోటేశ్వరి, 25వార్డు జనసేన అభ్యర్థి కె.అనురాధా తెలిపారు. ఈ మేరకు వారిద్దరూ గురువారం విజయవాడలో ఎస్‌ఈసీని కలసి పిర్యాదు చేశారు. తాము పురపాలక సంఘ కార్యాలయానికి వెళ్లి ఉపసంహరణపత్రాలు అందించలేదని, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. వారి వెంట తెలుగుయువత రాష్ట్రనాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, ఆతుకూరి నాగేశ్వరరావు, జనసేన నేత కొమ్మిశెట్టి సాంబశివరావు, తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-03-05T05:57:31+05:30 IST