జూలై ఆఖరుకు పనులు పూర్తి చేయాలి.

ABN , First Publish Date - 2021-06-17T03:43:26+05:30 IST

మండలంలో అభివృద్థి పనులు జూలై ఆఖరు నాటికి పూర్తి చేయాలని వెంకటగిరి శాసనసభ్యుడు ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు.

జూలై ఆఖరుకు పనులు పూర్తి చేయాలి.
కలువాయిలో సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనం.

ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.

కలువాయి, జూన్‌ 16 : మండలంలో అభివృద్థి పనులు జూలై ఆఖరు నాటికి పూర్తి చేయాలని వెంకటగిరి శాసనసభ్యుడు ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన కలువాయి గ్రామ దేవత కలువాయమ్మకు  పూజలు నిర్వహించారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులతో పాటు, సచివాలయ భవనాల నిర్మాణాలను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయంలో అభివృద్థి పనులపై సమీక్ష నిర్వహించారు.  సచివాలయ భవనాలు, రైతు భరోనా కేంద్రాల, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ కిన్లిక్‌ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ వివరాలపై ఆరా తీశారు.   


Updated Date - 2021-06-17T03:43:26+05:30 IST