బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదులు

ABN , First Publish Date - 2022-05-27T05:34:41+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ముస్లీం సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఏఐఎఫ్‌బీ కరీంనగర్‌ పట్టణశాఖ ప్రధానకార్యదర్శి వసీమొద్దీన్‌ ఆధ్వర్యంలో గురువారం ఒకటో ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదులు
బండి సంజయ్‌పై రెండవ ఠాణా సీఐకి ఫిర్యాదు చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

 కరీంనగర్‌ క్రైం, మే 26: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ముస్లీం సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఏఐఎఫ్‌బీ కరీంనగర్‌ పట్టణశాఖ ప్రధానకార్యదర్శి వసీమొద్దీన్‌ ఆధ్వర్యంలో గురువారం ఒకటో ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు సాజిద్‌ ఫక్రుజ్జామఖాన్‌ కరీంనగర్‌ రెండో ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూఏక్తాయాత్రలో భాగంగా బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఒక వర్గాన్ని తీవ్రంగా బాధపెట్టాయని అన్నారు. స్వార్థ రాజకీయాలతో మత విద్శేషాలు రెచ్చగొట్టొద్దన్నారు. రాజ్యాంపరంగా ఎంపీ హోదాలో ఉన్న సంజయ్‌ మంచి వాతావరణాన్ని తన వ్యాఖ్యలతో చెడగొడుతున్నారని విమర్శించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన సంజయ్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐఎఫ్‌బీ నాయకులు సలీం షేక్‌, ఎండీషాద్‌, ఎండీ మహమూద్‌ఖాన్‌, ఎండీ సలీం, ఇస్తియాక్‌ అహ్మద్‌ పాల్గొన్నారు. ఈ ఫిర్యాదులపై న్యాయపరమైన సలహాలు తీసుకున్న తర్వాత  చర్యలు తీసకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-05-27T05:34:41+05:30 IST