ద్విచక్రవాహనాల చోరీపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-01-27T05:41:48+05:30 IST

ద్విచక్రవాహనాల చోరీపై ఫిర్యాదు

ద్విచక్రవాహనాల చోరీపై ఫిర్యాదు

ఆమదాలవలస: స్థానిక రైల్వేస్టేషన్‌ పరిధిలోని బుకింగ్‌ కౌంటర్‌ సమీపంలో పార్కింగ్‌ చేసిన రెండు ద్విచక్రవాహనాలు చోరీకావడంపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పట్టణం లక్ష్మీనగర్‌కు చెందిన చింతాడ నిరోషా, శ్రీకాకుళం రూరల్‌ మండలం గొల్లపేటకు చెందిన ఈగల శ్రీనివాసరావు బుకింగ్‌ కౌంటర్‌ సమీపంలో తమ ద్విచక్రవాహనాలు పార్కింగ్‌ చేశారు. మార్కెట్‌లో పని ముగించుకొని వచ్చి చూసే సరికి వాహనాలు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వై.కృష్ణ తెలిపారు.


ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై ...

పొందూరు: తాడివలస పంచాయతీ కార్యదర్శి పి.సమీర ప్రొటోకాల్‌ ఉల్లంఘన కు పాల్పడుతున్నారని సర్పంచ్‌ టి.మణమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను సర్పంచ్‌గా తనను కాకుండా ఎటువంటి సంబంధంలేని వ్యక్తులతో నిర్వహించి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తనను అవమానపరుస్తున్నారని  పేర్కొన్నారు. గతంలోను ఈ విధంగా వ్యవహరించారని తెలిపారు. ప్రతిసారి ఈ విధంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2022-01-27T05:41:48+05:30 IST