బంగారమ్మపాలెంలో పుట్టిలతో పోటీలు
ABN , First Publish Date - 2022-01-15T06:07:25+05:30 IST
సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, రంగవల్లులు, కోడిపందాలు, ఎడ్లబండి పోటీలు సర్వసాధారణం. అయితే ఎస్.రాయవం మండలంలోని మత్స్యకారులు ఈ ఏడాది పండగను వినూత్నంగా నిర్వహించుకున్నారు.
ఎస్.రాయవరం, జనవరి 14 : సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, రంగవల్లులు, కోడిపందాలు, ఎడ్లబండి పోటీలు సర్వసాధారణం. అయితే ఎస్.రాయవం మండలంలోని మత్స్యకారులు ఈ ఏడాది పండగను వినూత్నంగా నిర్వహించుకున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వినియోగించే పుట్టిలతో పోటీలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని మూడు మండలాల నుంచి మత్స్యకారులు పాల్గొన్నారు. ఆద్యంతం ఉత్సాహంగా భరితంగా సాగాయి.