కమ్యూనిస్టు నేత ఖాసీం సాహెబ్ మృతి
ABN , First Publish Date - 2021-04-21T06:02:01+05:30 IST
ఖాసిం సాహెబ్ మృతి కమ్యూనిస్టు పార్టీకి నేటి కమ్యూనిస్టులకు ఎంతో లోటు అని సీపీఐ, సీపీఎం నాయకులు వై రవీంద్రబాబు, పిల్లి తిప్పారెడ్డిలు అన్నారు.
సీపీఐ, సీపీఎం నాయకుల నివాళ్లు
కనిగిరి, ఏప్రిల్ 20: ఖాసిం సాహెబ్ మృతి కమ్యూనిస్టు పార్టీకి నేటి కమ్యూనిస్టులకు ఎంతో లోటు అని సీపీఐ, సీపీఎం నాయకులు వై రవీంద్రబాబు, పిల్లి తిప్పారెడ్డిలు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పీసీపల్లి మండలంలోని నేరేడుపల్లి గ్రామానికి చెందిన తొలితరం కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు షేక్ ఖాసీం సాహెబ్ (95) సోమవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సందర్భంగా మంగళవారం కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.