సమాజసేవే లక్ష్యంగా ముందుకు సాగాలి
ABN , First Publish Date - 2020-11-30T05:22:47+05:30 IST
సమాజసేవే లక్ష్యంగా ముందుకు సాగాలి
రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్
ఘట్కేసర్ రూరల్: సమాజసేవే లక్ష్యంగా యువత ముందుకుసాగాలని రాచకొండ కమిషనర్ మహేష్భగవత్ అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం, వెంకటాపూర్ అనురాగ్ విశ్వవిద్యాలయంలో ఈనెల 19నుంచి 29వరకు జరిగిన ఫ్రీ రిపబ్లిక్ పేరేడ్- 2020 ముగింపు వేడుకలకు ఆదివారం సాయంత్రం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ముఖ్యంగా యువత సమాజ సేవే లక్ష్యంగా ముందు సాగాలని కోరారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని దేశానికి సేవచేయాలన్నారు. యువత లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సాగాలని, అప్పుడే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో ఆరు రాష్ట్రాల నుంచి 200 మంది ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధికారి డాక్టర్ కె.రమేష్రెడ్డి, అనురాగ్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ కెఎస్.రావు, డైరెక్టర్ అఫ్ స్టూడెంట్ అఫైర్స్ అనురాగ్ పల్లా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ చెన్నకేశ మల్లేష, ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.