పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-05-21T06:24:27+05:30 IST

నాణ్యతా ప్రమాణాలు పాటించి అభివృద్ధి పనులను నిర్వహించాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ సంబంధిత అధికారులకు సూచించారు.

పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

 నగర  కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ 

విద్యాధరపురం, మే 20 : నాణ్యతా ప్రమాణాలు పాటించి అభివృద్ధి పనులను నిర్వహించాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన డాక్టర్‌ కేఎల్‌ రావు హెడ్‌వాటర్‌ వర్క్స్‌లోని పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన హెచ్‌బీ కాలనీ మెయిన్‌రోడ్డు, హెల్త్‌ సెంటర్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. పైపు లైన్‌ నిర్మాణం పూర్తికావడంతో బ్లాకులు సక్రమంగా ఉందీ లేనిదీ తదుపరి పర్యటనలో పరిశీలిస్తానని అధికారులకు తెలియచేశారు. తన పర్యటనలో చేపల మార్కెట్‌ వద్ద రోడ్లపై కోళ్ల బాక్సులు తొలగించాలన్నారు. రోడ్డుపై ఎటువంటి సామగ్రి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కబేళా సెంటర్‌ హెల్త్‌ సెంటర్‌, 44వ డివిజన్‌ కమ్యూనిటీ హాల్‌, చిట్టినగర్‌ టీపీ రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణ పనులు, హనుమంతరావు చేపల మార్కెట్‌ ప్రాంతాలు, పూర్ణానందంపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈఈ నారాయణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T06:24:27+05:30 IST