పాపం ఈ ఫ్యామిలీ.. ఒక్క ఘటనతో..

ABN , First Publish Date - 2022-08-15T05:42:35+05:30 IST

కుటుంబసమేతంగా దైవదర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించి తల్లీకుమారుడు మృతి చెందగా తండ్రీకుమార్తె గాయపడ్డారు. ఈ ఘటన పలమనేరు- బెంగళూరు జాతీయ రహదారి గంగవరం మండలంలోని పత్తికొండ సమీపంలో ఆదివారం జరిగింది.

పాపం ఈ ఫ్యామిలీ.. ఒక్క ఘటనతో..
గాయత్రి, మిఽథున్‌ (ఫైల్‌ఫొటో)

దైవదర్శనానికి వెళ్లి వస్తూ... కానరాని లోకాలకు

ఆగివున్న లారీను ఢీకొన్న కారు


తల్లీకుమారుడి మృతి, తండ్రీకూమార్తెకు గాయాలు


గంగవరం, ఆగస్టు: కుటుంబసమేతంగా దైవదర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించి తల్లీకుమారుడు మృతి చెందగా తండ్రీకుమార్తె గాయపడ్డారు. ఈ ఘటన పలమనేరు- బెంగళూరు జాతీయ రహదారి గంగవరం మండలంలోని పత్తికొండ సమీపంలో ఆదివారం జరిగింది.  పోలీసుల కథనం మేరకు... బెంగళూరుకు చెందిన వెంకటబాలాజి, ఆయన భార్య గాయత్రి, కుమారుడు మిథున్‌, కుమార్తె వనిత... తమిళనాడులోని కాంచీపురం దేవాలయ దర్శనార్థం కారులో వెళ్లారు. దర్శనం ముగించుకుని బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు.  మార్గమధ్యంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పత్తికొండ సమీపంలో కారు పంక్చర్‌ అయి అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగి వున్న లారీ కిందకు వేగంగా దూసుకుపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న గాయత్రి(30), మిథున్‌(3) దుర్మరణం చెందగా వెంకటబాలాజి, వనిత(4) స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే గంగవరం ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను  పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 



Updated Date - 2022-08-15T05:42:35+05:30 IST