టీకాపై దృష్టి సారించండి

ABN , First Publish Date - 2021-04-13T05:13:31+05:30 IST

కరోనా వాక్సినేషన్‌పై వైద్యాధికారులు, సిబ్బంది, ఇతర అధికార యంత్రాంగం దృష్టి సారించాలని కలెక్టర్‌ శ్రుతి ఓఝా అదేశించారు.

టీకాపై దృష్టి సారించండి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రుతి ఓఝా

- కలెక్టర్‌ శ్రుతి ఓఝా

    గద్వాల, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : కరోనా వాక్సినేషన్‌పై వైద్యాధికారులు, సిబ్బంది, ఇతర అధికార యంత్రాంగం దృష్టి సారించాలని కలెక్టర్‌ శ్రుతి ఓఝా అదేశించారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులు, సిబ్బందితో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 45 సంవత్సరాలు నిండిన వారందరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చిన వారందరికి టీకా ఇవ్వాలన్నారు. జిల్లాలో వ్యాక్సిన్‌ కొరత లేదని స్పష్టం చేశారు. కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి చందూనాయక్‌, సీఈవో ముసాయిదా బేగం, డీఈఓ సుశీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:13:31+05:30 IST