రైతు భరోసా చెక్కు పంపిణీ
ABN , First Publish Date - 2022-05-17T05:36:09+05:30 IST
స్థానిక సాయి ఆరామంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద మంజూరైన నిధులకు సంబంధించి మెగా చెక్కును కలెక్టర్ బసంతకుమార్.. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డితో కలిసి సోమవారం రైతులకు అందజేశారు.
పుట్టపర్తి, మే 16: స్థానిక సాయి ఆరామంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద మంజూరైన నిధులకు సంబంధించి మెగా చెక్కును కలెక్టర్ బసంతకుమార్.. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డితో కలిసి సోమవారం రైతులకు అందజేశారు. నాలుగో విడత కింద 263526 మంది రైతులకు సంబంధించి 197.64 కోట్ల పెట్టుబడి సాయాన్ని బటన నొక్కి, ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి విడుదల చేశారు. కార్యక్రమానికి వర్చువల్ విధానంలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఎమ్మెల్యే, పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం అందుకు సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారన్నారు. అంతకు ముందు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జిల్లా అధికారి శివన్నారాయణ, ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.