కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 8 మందికి Covid
ABN , First Publish Date - 2021-12-29T15:58:42+05:30 IST
తిరువారూర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కార్యాలయంలో పనిచేస్తున్న కలెక్టర్ పీఏ, కంప్యూటర్ ఆపరేటర్, డ్రైవర్, పారిశుధ్య కార్మికులు అని మొత్తం 8
పెరంబూర్(చెన్నై): తిరువారూర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కార్యాలయంలో పనిచేస్తున్న కలెక్టర్ పీఏ, కంప్యూటర్ ఆపరేటర్, డ్రైవర్, పారిశుధ్య కార్మికులు అని మొత్తం 8 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని హోం క్వారంటైన్కు తరలించారు. అదే సమయంలో గత రెండు రోజులుగా క్యాంపు కార్యాలయానికి వచ్చిన అధికారులు, ప్రజల వివరాలు సేకరించి వారిని పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అదే సమయంలో కలెక్టర్, కుటుంబ సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు.